జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం
ఉత్తమ పార్లమెంటేరియన్ మిర్యాలగూడ మాజీ పార్లమెంట్ సభ్యుడు సూదిని జైపాల్ రెడ్డి మృతికి సిపిఐ నల్గొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్న దని సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లా నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యాభ్యాసం చేసాడని మొదటి నుంచి నల్లగొండ జిల్లా తో విడదీయలేని బంధం ఉందని తెలిపారు. రెండు సార్లు మిర్యాలగూడ పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్ని క అయ్యారని, జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో కల్మషం లేని మనిషి గా అందరితో కలిసి మెలిసి ఉండే వారని అన్నారు. జైపాల్ రెడ్డి గారి మృతికి సిపిఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని పేర్కొన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment