రామ్ రెడ్డి మృతికి సిపిఐ సంతాపం
రైతాంగ సాయుధ పోరాట యోధులు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కామ్రేడ్ గ ట్టి కొప్పుల రామ్ రెడ్డి మృతికి సిపి ఐ నల్లగొండ జిల్లా సమితి ప్రగాఢ సంతాపం తెలియ జేసింది. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి రామ్ రెడ్డి అని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం ముందుండే వారని అన్నారు. వారి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం సానుభూతిని తెలియజేశారు.
పల్లా నరసింహారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లగొండ.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment