నో డాక్టర్ నో మెడిసిన్
డాక్టర్ తో అవసరం లేదు, మందులతో పనిలేదు
మీ ఆరోగ్యం మీ చెతుల్లో
శ్రీ సత్య సాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో ఈ రోజు జులై 27 శనివారం సాయంత్రం 5 గంటలకు, ఆరోగ్యంపై ఉచిత అవగాహన సదస్సు నల్గొండలోని బీజేపీ ఆఫీసులో ఏర్పాటు చేశారు. ఈ సదస్సు లో డాక్టర్ అశోక వర్ధన్ రెడ్డి అధిక బరువుపై, సర్వేకల్ స్పాండిలైటిస్, షుగర్, బిపి, థెరయిడ్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల కండరాల నొప్పిలపై ఆక్యుపెంచేర్, నురోతెరిపి, సూజోక్ థెరపీ, నీళ్ల త్రాగడం ద్వారా వ్యాధులు తగ్గించుకోవడం పై సూచనులు చేస్తారు. అనేక రకాల జబ్బులు ఎలాంటి మందులు వాడకుండా, డాక్టర్ తో పని లేకుండా ఎలా తగ్గించకో వచ్చో అనే దానిపై ఆయన ప్రసంగం ఉంటుందని,సదస్సుకు వచ్చేవారు నోట్ బుక్, పెన్ తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు. సమయానికి వచ్చి ముందే మీ సీటు రిజర్వ్ చేసుకోవాలని కోరారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment