నల్గొండ వీటి కాలనీలోని బస్ స్టోప్ లో హెద్రబాద్ నాన్ స్టాప్ బసుకు రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆర్టీసీ సూపరింటెండెంట్ శ్యామలకు మాజీ కౌన్సిలర్ రావుల
వినతి పత్రం ఇచ్చారు. గతంలో 15 సంవస్థములనుండి ప్రజల సౌకర్యమ్ కొరకు వీటి కాలనీలో రెజర్వేషన్ ఏర్పాటు చేశారని, కొని రోజుల క్రితం రిజర్వేషన్ తొలగిన్చడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగుతున్నాయని రిజెర్వేషన్ వెంటనే పునరుద్ధరణ చేయాలని కోరారు. ఈ వినతి పత్రం ఇచ్చినవారిలో నాగార్జున రెడ్డి, సతీష్, వెంకటేశ్వర్లు, నరేష్ పరమేష్, వెంకట్ స్వామి, తదితరులు ఉన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment