Skip to main content

ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం

*ఒకరికి ఇద్దరు... పాక్‌పై భారత బలగాల ప్రతీకారం* 


         


వరుసగా మూడు రోజుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తున్న పాకిస్తాన్ సైన్యానికి భారత భద్రతా దళాలు ఇవాళ గట్టి సమాధానం చెప్పాయి. ఓ జవానును పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌కు ఇద్దరు పాక్ రేంజర్లను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, కుప్వారా జిల్లాల్లో పాక్ సైనిక మూకలు కాల్పులకు తెగబడ్డాయి. తీవ్రంగా గాయపడిన ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాక్ రేంజర్లపై అంతే స్థాయిలో విరుచుకుపడిన భారత జవాన్లు ఇద్దరు పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు అధికారుల వెల్లడించారు.


 
సోమవారం కూడా పూంచ్‌లోని షాపూర్ సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో సరిహద్దు ప్రాంతాలపై పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఆదివారం పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో 10 రోజుల పసికందు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. కాగా గత ఆరు నెలల్లో పాకిస్తాన్ మొత్తం 1,248 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. కేవలం మార్చినెలలోనే 267 సార్లు దాయాది దేశం కాల్పులకు తెగబడగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్తాన్ కాల్పులను భారత సైన్యం అంతే స్థాయిలో తిప్పికొడుతున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభకు తెలిపారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్