Skip to main content

ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి*

 


*ఇంకుడు గుంతల పట్ల మరింత అవగాహన కల్పించాలి : పద్మనాభ రెడ్డి*



https://youtu.be/3R5iKFBWOoE


నల్గొండ :  ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల వాన నీటిని సంరక్షించుకోవడంతో పాటు భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని, ఇంకుడు గుంతల ప్రధాన్యతపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని జిల్లా అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి అన్నారు.
శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్టార్స్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయగా వాటిని అదనపు ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు సాగాలని ప్రజలను కోరారు. ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల కలిగే లాభాలు, భావి తరాలకు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చేసిన వాళ్లవుతామని చెప్పారు. పెద్ద ఎత్తున వినియోగిస్తున్న ప్లాస్టిక్ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకుడు గుంటలపై ప్రజలలో మరింత చైతన్యం తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో డిఎస్పీ రమేష్, వ్యవసాయ శాఖ ఏ.డి. హుస్సేన్,  సిఐలు రమణా రెడ్డి, సురేష్ కుమార్, ఆర్.ఐ.లు వై.వి.ప్రతాప్, శంకర్, స్పర్జన్ రాజ్, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్త, ఆర్.ఎస్.ఐ. శ్రీనివాస్, కిషన్ లయన్స్ క్లబ్ స్టార్స్ సభ్యులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్