Skip to main content

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన స్పీకర్ పోచారం


కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ కి  హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన  స్పీకర్  పోచారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలోని పార్లమెంట్ మరియు శాసనసభ్యుల బృందం.  


న్యూఢిల్లీలో గడ్కరీ ని అధికారిక నివాసంలో కలిసిన స్పీకర్ పోచారం హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి- బాన్సువాడ- రుద్రూర్-బోదన్-బైన్సా (230 కిమీ) పరిదిలోని రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించిందని తెలిపారు. ఈ రహదారిలో హైదరాబాద్ నుండి మెదక్ (64 కిమీ-NH 765 D), మరియు బోదన్ నుండి రుద్రూర్ (10 కిమీ- NH 161BB) వరకు ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించారని. మిగతా బాగంలోని మెదక్ - రుద్రూర్ (92 కిమీ), బోదన్-బాసర-బైన్సా (55 కిమీ) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఆమోదించి విస్తరణకు అనుమతి స్పీకర్ పోచారం కోరారు. .నూతన రహదారి అనుసందానంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోదన్ నియోజకవర్గాల పరిధిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉండడంతో పాటు, ప్రసిద్ధ సరస్వతి దేవాలయం కొలువైన బాసరకు రవాణా మెరుగవుతుందని అని తెలిపారు.  ఈ రహదారి విస్తరణలో ప్రాధమిక మౌళిక వసతులు మార్చడానికి అవసరమయ్యే నిధులలో 50 శాతం రాష్ట్ర వాటాగా భరించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అంగీకరించిన విషయాన్ని స్పీకర్  గడ్కరీ కి తెలియజేశారు.  
స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వెంట  MP లు నామా నాగేశ్వరరావు (ఖమ్మం), బిబీ పాటిల్ (జహీరాబాద్), శాసనసభ్యులు హనుమంత్ షిండే (జుక్కల్), జాజుల సురేందర్ ( ఎల్లారెడ్డి) ఉన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్