Skip to main content

అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?*


అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?*


పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారా? నటిస్తారా? అనే విషయంలో చాలా రోజులుగా భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు తెరపైకి వచ్చాయి. 2021 వరకు వరుస సినిమాలు చేస్తూ పవర్ స్టార్ బిజీ బిజీగా గడపబోతున్నారట.
తాను మళ్లీ నటన వైపు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా అయితే ప్రకటించలేదు. సినీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చను పలు మీడియా సంస్థలు తమ బాక్సాఫీస్ న్యూస్ బులిటెన్లలో ఫోకస్ చేసే ప్రయత్నం చేశాయి. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారని, సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు అని హితవు పలికినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరో వైపు అభిమాలను నుంచి కూడా ఒత్తిడి ఉండటంతో సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట.
ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ చేయబోయే మొదటి సినిమా సెట్స్ మీదకు వస్తుందని, గతంలో చేస్తానని మాట ఇచ్చిన బేనర్లలోనే ఆయన వర్క్ చేయబోతున్నారని, మొదట మైత్రి మూవీస్ బేనర్లో సినిమా చేస్తారని, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పని చేస్తారని, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని టాక్.
మైత్రి మూవీస్ బేనర్ సినిమా పూర్తి కాగానే రామ్ తాళ్లూరి బేనర్ ఎస్ఆర్‌టి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో పవన్ మరో సినిమా చేయబోతున్నారట. గతంలో సినిమా చేస్తానని రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాటను పవన్ ఇపుడు నిలబెట్టుకోబోతున్నారట. రామ్ తాళ్లూరితో చేసే సినిమాకు దర్శకుడిగా డాలీ పేరు వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసిన డాలీ పవర్ స్టార్ కోసం కథ సిద్దం చేశాడట. పవన్ ఈ కథ విని కొన్ని మార్పులు సూచించారని, పవన్ కళ్యాణ్ ఇపుడు జనసేన అధినేత కాబట్టి హుందాగా చూపించబోతున్నారని, డాలీ తన చిత్రంలో పవర్ స్టార్‌ను లెక్చరర్ పాత్రలో చూపించబోతున్నట్లు టాక్.
ఆ సారి పవన్ కళ్యాణ్ చేయబోయే చిత్రాలు పక్కా ప్లానింగుతో ఉండబోతున్నాయని, ఆరు నెలలకు ఒక సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. వీలైతే ఈ రెండు సినిమాల తర్వాత ఎఎం రత్నంకు అవకాశం ఇస్తారని టాక్. గతంలో వీరి కాంబినేషన్లో 'సత్యాగ్రహి' అనే సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్