Skip to main content

కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్


కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్


పాలమూరు రంగారెడ్డి  లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కీలక రిజర్వాయర్ అయిన కరివేన ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏరియల్ వ్యూ నిర్వహించి అనంతరం ఇంజనీర్లు అధికారులు వర్క్ ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో కరివెన రిజర్వాయర్ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలకు సీఎం స్పష్టం చేశారు.  ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా   నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. " మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్ చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్ట్లు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని ఎండలు ముదురక ముందే  పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేటాల్లకు రైతుల పంటలకు మన నీళ్ళందే తట్టుం డాలే.
 ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్యలు లేవు
అక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి . అక్కడక్కడ కొన్ని ఫినిషింగ్ పనులు తప్ప పెద్ద పనేమీలేదాడ.  ఇక మన దృష్టి అంతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మీదనే కేంద్రీకరించాలి.  మీ మిష న్లను కూడా పెంచండి. త్వరితగతిన పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఇంటెన్స్ వ్లు ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఆ విషయం కూడా మాకు స్పష్టం చేయాలి .. తప్ప పనుల్లో తాత్సారం జరగడానికి వీలు లేదు. వచ్చే వానకాలం వరకు పనులు పూర్తి రైతులకు నీళ్లు అందించాలి." అని సీఎం కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు
ఇంకా ప్రాజెక్టు  పనులకు సంబంధించి పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి , మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేసి  అక్కడనుండి వట్టెం ప్రాజెక్టు పరిశీలనకు వాయు మార్గంలో బయలుదేరారు
 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్  ఎంపీ లు సంతోష్ కుమార్ జోగినపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాములు  స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , కొడంగల్ ఎమ్మె ల్యే నరేందర్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు సీఎంవో అధికారులు  స్మితాసబర్వాల్ నీటిపారుదల శాఖ ఈ ఎన్ సి మురళీధరరావు సి ఈ రమేష్ కుమార్ తదితరులున్నారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్