Skip to main content

*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం*   *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం* 


*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం* 


 *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం* 


 *బాధిత కుటుంబ సభ్యులకు లక్ష అందజేసిన యువనేత మిథున్ రెడ్డి* 


 *"హీరో ప్రభాస్" సాహో బ్యానర్ కడుతూ అభిమాని వెంకటేష్ నాయక్ విద్యుత్ ఘాతం*


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమామేనియా నడుస్తుంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం కళ్ళలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. 10 వేల స్క్రీన్స్ లో సాహో విడుదలవుతుంది. రేపు సినిమా విడుదల అవుతున్న  కారణంగా థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటరులో విద్యుత్ ఘాతం జరిగి బోయినపల్లి ప్రాంతానికి చెందిన ప్రభాస్ అభిమాని వెంకటేష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు, యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశిరెడ్డి గాయపడ్డ అభిమాని వెంకటేష్ పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి  తనయుడు ఏపీ మిథున్ రెడ్డి ద్వారా ఈ సంఘటనను తెలుసుకొని ఆయన ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం బాధితునికి అంద చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ నాయక్ మిథున్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ వ్యవహారం పట్ల మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యు.వి క్రియేషన్స్ నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశి రెడ్డి తనకు స్నేహితులని ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక వారు చలించిపోయి లక్ష రూపాయలు వెంటనే బాధిత కుటుంబానికి అందజేస్తున్నట్టు ప్రకటించినట్లు మిథున్ రెడ్డి మీడియాకు తెలిపారు. అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకొని సంబరాలు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అనవసరంగా అభిమానులు తమ ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్