హైద్రాబాద్ లో హెచ్ఎండీఏ ద్వారా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ
పర్యావరణ పరిరక్షణలో ప్రజలలో అవగాహన కల్పించడానికి మట్టి గణేష్ విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించడానికి 60,000 సంఖ్యల 8 ఇంచుల గణేష్ విగ్రహాలను ప్రజలకు, ఎన్జీఓలు ఉచితంగా పంపిణీ చేయడానికి హెచ్ఎండిఎ ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఎండిఎ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హైదరాబాద్లోని 33 ప్రదేశాలలో పంపిణీ చేస్తోంది. వివిధ ప్రదేశాలలో మరియు హెచ్ఎండిఎ సిబ్బంది మరియు అధికారులతో కూడిన మొబైల్ వ్యాన్లలో కూడా ప్రజలకు నేరుగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. మట్టి గణేష్ విగ్రహాలు 28-08-2019 నుండి 30-08-2019 వరకు పంపిణీ చేస్తారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment