Skip to main content

17 సెప్టెంబర్  తెలంగాణ విమోచన  దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి - N శ్రీవర్ధన్ రెడ్డి తెలంగాణ విమోచన కమిటి చైర్మన్.

వీడియో చూడండి


https://youtu.be/Yu8HIFgOl2o


17 సెప్టెంబర్  తెలంగాణ విమోచన  దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి.


N శ్రీవర్ధన్ రెడ్డి
తెలంగాణ విమోచన కమిటి చైర్మన్.


సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి - విమోచన కమిటి చైర్మన్ ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి 
     బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ,విమోచన కమిటి కన్వీనర్ స్వామి గౌడ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డితో కలసి మాట్లాడారు. భారత దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం 1948 సెప్టెంబర్17 స్వాతంత్రం వచ్చిందని, నాటి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తిపొంది నాటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత పోలీస్ చర్య వల్ల పటేల్ కి లొంగిపోయి తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేసాడని అన్నారు.
నిజాం నిరంకుశత్వానికి అమాయకపు ప్రజలు బలిఅయ్యారని, నిజాం రజాకార్ల పాలనలో ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు,అఘాయిత్యాలకు, అత్యాచారాలకు బలిఅయ్యారని  అన్నారు.  నిజాం ప్రభువు,రజాకార్ల హింసలకు ఎంతో మంది మరణించగా వందలాదిమంది నిజాంకు జరిగిన వ్యతిరేక ఉద్యమంలో బలిఅయ్యారని, భైరన్ పల్లి లో 96మందిని కాల్చిచంపిన నిజాం రజకార్లు. 96మంది భైరన్ పల్లి గ్రామస్థుల బలి జలియన్ వలబగ్ ను తలపిస్తుందని, పాలమూరు జిల్లా అప్పంపల్లిలో 11మందిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపిన ఘటనలు తెలంగాణ లో అనేకం ఉన్నాయని పేర్కొన్నారు.
TRS ప్రభుత్వం 17సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలిని డిమాండ్ చేశారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి KCR విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వాలను డిమాండ్ చేశారని,  TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారని విమర్శించారు.  అధికారంలోకి వచ్చి 6సంవత్సరాలు పూర్తయినప్పటికి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని,  రాష్ట్రంలో నిజాం వారసులుగా పాలన చేస్తున్న KCR తెలంగాణ చరిత్రను భావితరాలకు దూరం చేసేవిధంగా వారి పాలన సాగుతుందని అన్నారు. 
నాటి నిజాం పాలనలో ఉన్న కర్ణాటకలో ఉన్న జిల్లాలు,మహారాష్ట్ర లో ఉన్న జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్ర భవిషత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తెలంగాణ లో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులైనరు కొమురం భీమ్, చాకలి ఐలమ్మ,సోయబుళ్ల ఖాన్ లాంటి మహనీయులు అమరులైనరు తెలంగాణ చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన గురుతర బాధ్యతతో బిజెపి 1998 నుండి పోరాటం చేస్తుందని, 
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేవిధంగా బిజెపి ఉద్యమిస్తుందని,  కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపేటట్లు వత్తిడి తీసుకోస్తామన్నారు. .రాష్ట్రంలో ఉన్న విద్యావంతులను ,మేధావులను ఏకం చేస్తాం విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతామన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్