సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విమోచన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసింది. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, జి.ప్రేమేందర్ రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధికారికతెలంగాణ విమోచన దినోత్సవానికై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment