Skip to main content

ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను   ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు  సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు.
ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తులలో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు.
దేశంలో ఆహార సమృద్ది ఉన్నప్పటికీ, ప్రోటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులను మించిన సరైన అహారం మరొకటి లేదని అన్నారు. సాంప్రదాయ ఆహార పద్దతులే సరైనవని చెబుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమం ఉద్యమంగా మారాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భౌతికంగా ఫిట్ గా ఉన్నపుడే మానసికంగా దృఢంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఫిట్ నెస్, యోగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార అలవాట్లను పునః సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రోటీన్లతో కూడిన పోషకాహారం పోషకాల లోపాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టడాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. అక్వారంగంలో జరిగే పరిశోధనలు ఆ రంగం రైతులకు ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ఉద్భోదించారు. 


తెలంగాణా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు 70-90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. 'ప్రధాన మంత్రి సురక్ష యోజన' కింద మాత్స్యకారులకు లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో 128 కోట్ల సీడ్ పంపిణీ అయిందని, 4 కోట్ల పైగా రొయ్యల సీడ్ ను జలాశయాల్లో వదిలినట్లు, దీనివల్ల రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ది ఊపందుకొందని అన్నారు. ఎంపిఇడిఎ సాంకేతిక సహాకారం రాష్ట్రానికి అందించాలని కోరారు. తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రం నుంచి ఆక్వా ఎగుమతుల వృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.


ఎంపిఇడిఎ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆక్వారంగ అభివృద్దికోసం ప్రభుత్వం, ప్రైవేటురంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. 


ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చెసిన పది మంది ఆక్వా రైతులకు ఉప రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.
రాజ్య సభ సభ్యులు బండ ప్రకాశ్, చేవెళ్ళ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్