Skip to main content

కొండా సురేఖ,  రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి!


కొండా సురేఖ,  రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి!


వరంగల్‌: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్‌లు సైతం కాషాయ కండువా కప్పేసుకున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమలనాథులు కండువా కప్పేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మహిళా నేత కొండా సురేఖ, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఇదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో.. నగరంలోని పలు కార్యక్రమాను రద్దు చేసుకున్న షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు. అయితే ఢిల్లీ వెళ్లి మరి అమిత్‌షాను కలిసే యోచనలో రేవూరి ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు.. తమ్ముడి మృతితో కొండా సురేఖ బీజేపీలో చేరికకు కొంత ఆలస్యమైంది. అయితే రేవూరి.. తెలంగాణ టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్నారు. రేవూరి చేరిక ఖరారైతే మాత్రం టీడీపీకి ఊహించని షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొండా సురేఖ, రేవూరి ఇద్దరూ ఒకేసారి కాషాయం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్