నల్గొండలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఈ రోజు జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక విధానాలు చేపడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఆనాటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి రైతాంగం ఆత్మహత్యలు కు దోహదపడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం నారి ఐలయ్య పాలడుగు నాగార్జున జిల్లా కమిటీ సభ్యులు పాలడుగు ప్రభావతి పుచ్చకాయల నర్సిరెడ్డి చినపాక లక్ష్మీనారాయణ నాయకులు దండంపల్లి సత్తయ్య అద్దంకి నరసింహ కొండ వెంకన్న మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment