Skip to main content

హైదరాబాద్ వాసులకు మరో  రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు


హైదరాబాద్ వాసులకు మరో  రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను శుక్రవారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ.... ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు  అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు దోహదం చేస్తాయన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయిందని... ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు నలువైపులా 'అర్బన్ లంగ్ స్పేస్' పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా పార్కుల్లో  అదనపు హంగులు సమకూరుస్తున్నామని చెప్పారు. 


దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను అభివృద్ది చేశారని తెలిపారు. రూ.74.424 లక్షలతో గజీబా, కూర్చునేందుకు వీలుగా బెంచ్ లు, వాటర్ హర్వేస్టింగ్ స్ట్రక్చర్స్, యోగా షేడ్,  వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గజీబా  (వ్యూ పాయింట్) నుంచి చూస్తే మొత్తం అర్బన్ పార్కు వ్యూ తో పాటు  నగరం వ్యూ కూడా కనిపించేలా నిర్మాణం చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. పార్క్ లు ఆహ్లాదకరంగా ఉండేలా స్థానికులు కూడా తోడ్పాటునందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అడవులను పెంచడం, అటవీ భూముల 
రక్షణకు పెద్దపీట వేస్తుందన్నారు. హరితహరం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని తెలిపారు. చెట్లను రక్షిస్తే..చెట్లు మనల్ని రక్షిస్తాయన్నారు.


*మంత్రి మల్లారెడ్డి* మాట్లడుతూ... సీయం కేసీఆర్ అడవుల రక్షణకు అధిక ప్రాధన్యతనిస్తున్నారన్నారు. నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్ కోర్ట్, ఓపెన్ జిమ్,  చిల్డ్రన్ గేమ్ జోన్ ఏరియా,
ఏర్పాటు చేస్తామని వివరించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడపడానికి టూరిజం స్పాట్గా ఈ పార్క్ లను  తీర్చిదిద్దుతామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, మేడ్చల్  జిల్లా  కలెక్టర్ యంవీ రెడ్డి,  అదనపు పీసీసీఎఫ్ లు  స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, చంద్రశేఖర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, ఇతర అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్