Skip to main content

తెలంగాణా కు 3110 కోట్లు మంజూరి చేసిన కేంద్రం

తెలంగాణా కు 3110 కోట్లు మంజూరి చేసిన కేంద్రం



కంపా నిధులు కింద రాష్ట్రానికి రూ. 3110  కోట్లు విడుదల చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చిందని  రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్  అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్. శోభ  ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కంపా (కాంపెన్సెటరీ ఎఫారెస్టెషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల  కింద రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు.  రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెద్దమొత్తంలో నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రత్యామ్నాయ అడవుల సృష్టికి  సీయం కేసీఆర్ సారధ్యంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.   ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి కంపా నిధులను సమర్థంగా ఉపయోగించడం వల్లే కేంద్రం నిధులు విడుదలన చేసిందని స్పష్టం చేశారు. వివిధ ప్రాజెక్టుల కింద తీసుకున్న అటవీభూమికి ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకానికి సీయం కేసీఆర్ అధిక ప్రాధన్యతనిస్తున్నారని తెలిపారు. ఈ కంపా నిధులతో మన రాష్ట్రంలో అడవుల పెంపకానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా నాలుగు విడతల్లో 113.58 కోట్ల మొక్కలను నాటామని వెల్లడించారు. ఐదో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 83 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 30 కోట్ల మొక్కలను నాటామన్నారు. సీయం కేసీఆర్ కొత్తగా పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకువచ్చారని.... ఆ చట్టాల్లో కూడా మొక్కల సంరక్షణకు పెద్దపీట వేశారన్నారు. నాటిన మొక్కల్లో 85% మొక్కలను కాపాడాలని..లేదంటే  స్థానిక ప్రజాప్రతినిదులు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో పొందుపరిచారని తెలిపారు. ఇప్పుడు ఉన్న అడవులను రానున్న నాలుగేళ్లలో రెట్టింపు చేసే లక్ష్యంగా పథకాలు సాగాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకానికి నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి  రానున్న రోజుల్లో ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అర్బన్పార్క్ల ఏర్పాటు, అడవుల పునర్జీవం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు.
అడవుల పరిరక్షణ, ప్రత్యామ్నాయ భూముల్లో చెట్ల పెంపకం, నది పరివాహక ప్రాంతాల్లో అడవుల రక్షణ, కంపా నిధుల వినియోగం, కేటాయింపులు తదితర అంశాలపై కూడా  సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్