Skip to main content

బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్


బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్


రాష్ట్ర మంత్రి   శ్రీనివాస్ గౌడ్ బిజెపి ఆన్లైన్, మొబైల్ నెంబర్ ఆధారిత సభ్యత్వ నమోదుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఎం ధర్మారావు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,రాష్ట్ర బిజెపి సభ్యత్వ ప్రముఖ్ తెలిపారు.


దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా మొబైల్ ద్వారా బిజెపి సభ్యత్వం తీసుకోవడం పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ  హర్షం వ్యక్తం చేస్తుండగా విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు


 *టిఆర్ఎస్* *పార్టీ చేస్తున్నట్లు ఓటర్* *లిస్టు ముందు పెట్టుకుని ఇంట్లో* *కూర్చొని బిజెపి సభ్యత్వాన్ని* *నమోదు చేయడం* *లేదు* . *టిఆర్ఎస్ పార్టీ లాగా ఆశలు* *చూపడం లేదు. బలవంతం* *పెట్టడం లేదు. భయ* *పెట్టడం లేదు. టీఆర్ఎస్ సభ్యత్వం* *తీసుకోకపోతే పెన్షన్లు,* *రైతుబంధు ఆగిపోతాయని ప్రజలను* *భయ పెట్టడం లేదు.* *సభ్యత్వం చేసుకుంటే ఇన్సూరెన్స్* *వస్తుందని టిఆర్ఎస్ లాగా బిజెపి* *తాయిలాలు ప్రకటించలేదని విమర్శించారు.


జాతీయవాదాన్ని బలపరచాలని, దేశం అభివృద్ధి చెందాలని,  ప్రధాని నరేంద్ర మోదీ గారిని బలోపేతం చేయాలని,  బిజెపి ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, స్వచ్ఛందంగా వారికి వారే మొబైల్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారని తెలిపారు.


కుటుంబ పార్టీలను తెలంగాణ ప్రజలు  వివిధ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ వాదులు తిరస్కరిస్తున్నారని,  రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీన పడుతుండడం, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణ ప్రజలు తిరగబడుతుండడంతో ఆ పార్టీ  నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అన్నరు.


మంత్రి   శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నట్లుగా ఒక గంటలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం  మూడు కోట్లు నమోదు చేసి మొబైల్ ద్వారా చూపించాలని టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ  సవాల్ చేస్తున్నదని .  టీఆర్ఎస్ పార్టీకి ఒక్క గంట కాదు పది రోజుల సమయం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని  చేయాలని సవాల్ చేశారు.


 మంత్రి  శ్రీనివాస్ గౌడ్  ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ చేసిన సభ్యత్వ నమోదుకు అనుగుణంగా మొబైల్ ద్వారా  అంతే సభ్యత్వ నమోదును చేసి  చూపించాలని, ఆ విధంగా నమోదు చేసి వివరాలను బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.


టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు  కల్వకుంట్ల తారక రామారావుతో పాటు , టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు, మొబైల్ సభ్యత్వ నమోదుపై అవగాహన రహితంగా మాట్లాడడం మానుకోవాలని, *శాసనసభ,* *పార్లమెంటు ఎన్నికలలో* *ఇచ్చిన వాగ్దానాలను* *అమలు చేయలేక పోవడంతో ప్రజలు* *టిఆర్ఎస్ పార్టీపై ఆగ్రహంతో* *ఉన్నారని, . *టిఆర్ఎస్* *పార్టీ కుటుంబ పాలనను* *ప్రజలు వ్యతిరేకిస్తున్నారని.* *నియంతృత్వ,* *నిరంకుశ టిఆర్ఎస్* *ప్రభుత్వ పై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు.


రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో ఓటమి ఖాయమని, టిఆర్ఎస్ పార్టీ బలహీనపడి పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని. టిఆర్ఎస్ పార్టీ బలహీనపడడం భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం, ప్రత్యామ్నాయంగా  అత్యధికంగా మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను బిజెపి గెలుచుకుంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీకి తిరోగమనం, పురోగమనంతో  బలమైన శక్తిగా బిజెపి రాష్ట్రంలో ఎదిగిందని అన్నారు.



2023లో కానీ,  ఒకవేళ అంతకుముందు కానీ శాసనసభ ఎన్నికలు జరిగితే బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్