Skip to main content

*గ్రీవెన్స్ పై నిరంతర పర్యవేక్షణ : ఎస్పీ రంగనాధ్*

*గ్రీవెన్స్ పై నిరంతర పర్యవేక్షణ : ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : గ్రీవెన్స్ డే ద్వారా ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తులు, ఆర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.


సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వస్తున్న ప్రతి దరఖాస్తును పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి దరఖాస్తుదారునికి రశీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారం అయిందో లేదో తెలుసుకుంటున్నామని తెలిపారు. వీటన్నింటితో పాటు మూడు కన్నా ఎక్కువ సార్లు వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే విషయమై విచారిస్తున్నామని తెలిపారు. పరిష్కారం అయిన ఫిర్యాదులు, అర్జీలకు సంబంధించి సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా సమాచారం అందిస్తున్నామని వివరించారు. దరఖాస్తులన్నింటిని ఆన్ లైన్ లో పొందుపర్చడం ద్వారా వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ అధికారులతో గ్రీవెన్స్ విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. గ్రీవెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతున్నందువల్ల అందుకు అనుగుణంగా ఫిర్యాదుదారులకు సమయం కేటాయిస్తున్నామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.
మొత్తం 40 కి పైగా దరఖాస్తుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫోన్ ల ద్వారా ఆదేశించారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్