హైదరాబాద్ : టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంఎల్ సిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తాతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఎల్ఎ కోటా ఎంఎల్ సి ఎన్నికల్లో గుత్తా ఎంఎల్ సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను ఎంఎల్ సిగా ఎన్నుకున్న ఎంఎల్ఎలకు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆశయ సాధనలో తాను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు పాల్గొన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment