Skip to main content

**ఇద్దరి యువకుల ఆధ్యాత్మిక యాత్ర.. టెంపుల్ రన్**


*ఇద్దరి యువకుల ఆధ్యాత్మిక యాత్ర.. టెంపుల్ రన్..* 



సమాజంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పులు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.. ఈ మార్పులు కొంత వరకూ మేలు చేస్తుండగా అధిక శాతం చెడు మార్గాల వైపు మళ్లిస్తున్నాయి. ప్రధానంగా కెరీర్ ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాల్సిన యువత స్మార్ట్ ఫోన్ ల మోజులో పడి తమ వ్యక్తి గత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు పని ఒత్తిడిని ఎదుర్కొనలేక వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు.  ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు లోని కారైకుడి ప్రాంతంలోని వేలంగుడికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పండిదురై.. కార్తికేయన్ లు అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర చేశారు. భారత దేశం.. నేపాల్ లలోని ప్రముఖ దేవాలయాలను వీరిద్దరూ దర్శించుకుని యువతకే కాకుండా అన్ని వర్గాల వారికి ఆదర్శంగా నిలిచారు. వారి సొంత కారులో 49 రోజుల పాటు 20,800 కిలోమీటర్లు ప్రయాణం చేసి 501 దేవాలయాలను దర్శించు కున్నారు. వారి స్వగ్రామంలో ప్రారంభమైన ఈ ఇద్దరి అన్నదమ్ముల అపురూపమైన ఆధ్యాత్మిక యాత్ర అదే గ్రామంలో ఇటీవల ముగిసింది. ఈ సందర్భంగా పాండిదురై మాట్లాడుతూ తాము నిర్వహించిన ఆధ్యాత్మిక యాత్ర తమ జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఇప్పటి యువతలో ఆధ్యాత్మిక భావాలు తగ్గి పోయాయని.. దేశవ్యాప్తంగా తాము దేవాలయాల సందర్శన ద్వారా అనేక అంశాలను అవగాహన చేసుకున్నామని చెప్పారు దురై. దేవాలయ వ్యవస్థను.. ఆధ్యాత్మిక సంపదను... సంస్కృతి.. సంప్రదాయాలను  కాపాడుకునేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు యువత తోడ్పాటు ఎంతో అవసరం అన్నారాయన. ఇందులో భాగంగా తాము చేసిన ఆధ్యాత్మిక యాత్రకు అడుగడుగునా అపురూపమైన స్వాగతం లభించిందన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్