* ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో ఆంగ్ల నూతన నూతన సంవత్సరం సందర్భంగా ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ కేక్ కట్ చేసి అధికారులు,ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం లో అధికారులు,ఉద్యోగులు నూతనోత్తేజం తో పని చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ది ప థకాలు లక్ష్యిత ప్రజలకు అందేలా చూడాలని ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. రెండవ తేది నుండి నిర్వహించనున్న పల్లె ప్రగతి,మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా అధికారులు విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు.డి.అర్.ఓ.రవీంద్ర నాథ్, అర్.డి.ఓ. జగదీశ్వర్ రెడ్డి,పలువురు జిల్లా అధికారులు జిల్లా సహకార అధికారి అర్.శ్రీనివాస మూర్తి,డి.పి.అర్.ఓ.పి.శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ పి.డి.రాజ్ కుమార్,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి గూడ వెంకటేశ్వర్లు,అర్. డబ్ల్యు.ఎస్. ఈ ఈ పాపా రావు,కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ.మోతి లాల్,గెజిటెడ్,రెవెన్యూ,టీ.ఎన్.జి. వో.సంఘాల నాయకులు, తదితరులు ఇంఛార్జి కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment