Skip to main content

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి



హాలిమ్, హారీస్ కౌంటర్లకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు



బేకరీలు, పాన్, కిరాణా షాపులు  కౌంటర్లు ఏర్పాటు చేయడం నిషేధం


వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ఆధ్వర్యంలో కేసుల నమోదు


నల్లగొండ : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హరీస్, హాలీమ్ కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్న అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.


బుధవారం నల్లగొండ పట్టణంలో వన్ తౌన్ పరిధిలో రాయల్ సి కేఫ్, స్పైసి హోటల్, గ్రాండ్ హోటల్స్ నిర్వాహకులు, సిబ్బంది లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ నేతృత్వంలో కేసులు నమోదు చేశామని చెప్పారు. హరీస్, హాలిమ్ విక్రయాలు సాగిస్తున్న స్పైసి హోటల్ నిర్వాహకుడు యం.డి.ఫరీదుద్దీన్, అందులో పని చేసే ముస్తాక్, రాయల్ సి కేఫ్ నిర్వాహకుడు ఇమ్రాన్, అందులో వంట మాస్టర్ గా పని చేసే మహ్మద్ లతీఫ్, గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు షేక్ అరిఫ్ లను అదుపులోకి తీసుకొని ఏపీడమిక్ డిసిస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో హరీస్, హాలిమ్ విక్రయాల నిమిత్తం కౌంటర్లు ఏర్పాటుకు పోలీస్ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పట్టణంలోని పలు పాన్ షాప్స్, బేకరీల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారని ఇవి పూర్తిగా నిషేధమని ఆయన తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా హాలీమ్, హరీస్ విక్రయాలను కౌంటర్లు ఏర్పాటు చేయడం, బట్టీలు పెట్టుకోవడం, డోర్ డెలివరీ చేయడం నిషేధమని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాన్ షాప్స్, బేకరీలు, కిరాణా దుకాణ వ్యాలరులు ఎవరైనా హరీస్, హాలిమ్ కౌంటర్లు పెట్టి విక్రయించకూడదని డిఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన కొన్ని మినహాయింపులు కేవలం గ్రామీణ ప్రాంతాల వరకే పరిమితమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్పించిన మినహాయింపులు పట్టణ ప్రాంతాలకు వర్తించవని అందువల్ల పట్టణ ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆయన సూచించారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్