Skip to main content

సూర్యాపేటలో కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్



కరోనా నివారణకు సమర్థవంతంగా  పనిచేసేందుకు  అదనపు అదికారులను నియమించాం-CS సోమేశ్ కుమార్


సూర్యాపేట జిల్లా :-  సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 83 కి చేరడంతో ప్రభుత్వం అప్రమాత్రమై  నివారణ చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల  మేరకు CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డిలు సూర్యాపేటను సందర్శించారు.
 CS సోమేశ్ కుమార్, DGP మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్,  జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డిలు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్,  కన్ టైన్ మెంట్ జోన్ లను, వాటి చుట్టు ప్రక్కల పరిసరాలను పరుశీలించారు. ఈ సందర్బంగాసీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట లో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని సీఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. దీనిపై మరింత సమర్థ వంతంగా పనిచేసేందుకు అదనపు అదికారులను నియమించామని, కంటైన్మెంట్ జోన్లలో జీరో మూవ్ మెంట్ చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు.ఆర్ అండ్ బీ వాళ్లకు తగిన సూచనలు చేశామని, ఆయా ప్రాంతాలకు కొత్తవారు ఏవరు వచ్చారనేదానిపై సర్వే చేయాలని నిర్ణయించామని అన్నారు. క్వరెంటైన్ లో ఉన్నవారికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనే దానిపై సూచనలు చేశామని, త్వరలో కంట్రోల్ లోకి వస్తుందని మాకు నమ్మకం ఉందని అన్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వాళ్లకు పూర్థిస్థాయిలో మద్ధతుగా ఉంటామని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కొరారు. డిజిపి మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు హై లెవల్ టీమ్ గా క్షేత్రస్థాయిలో సందర్శించామని, జిల్లా అధికార యంత్రాంగానికి మరింత సపోర్ట్ ను ఇవ్వడానికి వచ్చామని తెలిపారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సూర్యాపేట జిల్లాలో కూడా మహమ్మారీని కట్టడి చేస్తామని, కంటైన్మెంట్ ఏరియాలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. పక్క పక్క ఇళ్ల వారు కూడా కాంటాక్ట్ లో ఉండకూడదని, కంటేన్మెంట్ ఏరియాలోకి బయటివారు రాకుండా.. లోపలి వారు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భవిష్యత్ లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేలా పలు సూచనలు చేశామని, అన్నీ శాఖలకు సహాయ సహకారం అందిస్తూ పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే జిల్లాలో వైరస్ కట్టడి అవుతుందన్న విశ్వాసం మా బృందానికి ఉందని, జిల్లా ప్రజలు లాక్ డౌన్ అమలుకు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. కమిషన్ ఏజంట్ కు పాజిటివ్ రావడం అతను ఎన్నో దుకాణాదారులను కాంటాక్ట్ కావడం వల్లే జిల్లాలో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని తెలిపారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్