Skip to main content

కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు


కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు




గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి  కె  చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు.  ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో కేసులు పెరుగకుండా చూడాలని ఆదేశించారు.  సిఎం గారి ఆదేశాలమేరకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్,  ముఖ్యమంత్రి గారి ముఖ్యకార్యదర్శి నర్సింగా రావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, మున్సిపల్ , వ్యవసాయ శాఖ ముఖ్య  కార్యదర్శులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. సిఎం  సూచనల మేరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్ శాఖల సమన్వయంతో పని చేస్తున్నాయని సిఎం  నివేదించినట్లు మంత్రి తెలియజేశారు. 
ఈ రోజు 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1038 కి చేరుకున్నాయి.  మలకపెట్ గంజ్ లో పనిచేస్తున్నపహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. వీరి కుటుంబాలన్నీటిని ఆసుపత్రిలో ఐసొలేషన్ లో ఉంచాము. గంజ్, పహదీశరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి తగు చర్యలు తీసుకుంటున్నారు  . ఈరోజు ముగ్గురు కరోనా మరియు ఇతర ఆరోగ్య సమస్యల  వల్ల చనిపోయారు. వీరిలో .. 
1 : 48(male) సంవత్సరాల వయసుగల రామంతాపూర్ కి చెందిన వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయారు. షుగర్, బీపీ, స్థూలకాయం,న్యుమోనియా తో బాధపడుతూ చనిపోయారు. 


 2 : 76 సంవత్సరాల  (male) : వనస్థలిపురం చెందిన వ్యక్తి , గుండె,కిడ్నీ,న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ లో చేరిన 24 గంటల్లోనే చనిపోయారు. 


3 : 44 (female ) సంవత్సరాల వయసుగల దుర్గానగర్, జియగూడ కి చెందిన  వ్యక్తి నిన్న గాంధీ ఆసుపత్రి కి వెంటిలేటర్ మీదనే వచ్చారు. వచ్చిన గంటల్లోనే మరణించారు. ఈమె కూడా బీపీ, షుగర్,న్యుమోనియా తో బాధ పడుతున్నారు. 


ఈరోజు 33 మంది కరోనాకు పూర్తి  చికిత్స తరువాత, పరీక్షలో రెండు నెగెటివే రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 50 సంవత్సరాల వయసులగల డాక్టర్ డిశ్చార్జ్ అయ్యారు. గాంధీలో 20 రోజుల క్రితం తీవ్ర మైన వ్యాది లక్షణాలతో అడ్మిట్ అయ్యారు.  హైడ్రోక్సి క్లోరోక్వీన్, అజిత్రో మైసిన్ తదితర  మందులు అందించి పూర్తిగా నయం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాలపట్ల  పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషం అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇక్కడ పర్యటిస్తున్న బృందం జరుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్ లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల  హోం శాఖ  జాయింట్ సెక్రెటరీ శ్రీమతి సలీల శ్రీవాత్సవ  ప్రశంశలు కురిపించారని అన్నారు.  కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు చ తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే రిపోర్ట్ పంపిన తరువాత రాజకీయ విమర్శలకు తావు లేదని మంత్రి అన్నారు. గాంధీ, కింగ్ కోటి, గచ్చి బౌలీ, ఫీవర్ హాస్పిటల్స్, లాబ్స్, కంటేనమెంట్ ప్రాంతాలు, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, నైట్ షెల్టర్ లు విస్తుతంగా పర్యటించి అత్యంత సంతృప్తి వ్యక్తం చేస్తూ రిపోర్ట్ పంపించారని మంత్రి తెలిపారు. 


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్