Skip to main content

సూర్యపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు

 



సూర్యాపేట జిల్లా కేంద్రంలో  మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు 


లాక్ డౌన్ పూర్తిగా అమలులో ఉన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో అటు మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజా పరిణామాల పై ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక సమీక్ష నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పలు అంశాలపై సుదీర్ఘంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లతో పాటు అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి పి డి డి ఆర్ డి ఏ. కిరణ్ కుమార్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్న పురోగతి తో పాటు లాక్ డౌన్ అమలులో బాగంగా కంటైన్మెంట్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాలను అధికారులు మ్యాప్ లతో సహా మంత్రి జగదీష్ రెడ్డి కి వివరించారు. ఎక్కడికక్కడ పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.అన్నింటినీ సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ అమలుకు  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమే అయినప్పటికీ నిత్యావసర సరుకుల సరఫరా పై దృష్టి సారించాలని సూచించారు. అందుకు అనువైన పద్ధతుల్లో పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న సూర్యపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుండి పాలు, కూరగాయలు వార్డుల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.అదే విదంగా రాష్ట్రంలో నే మొట్టమొదటి సారిగా సూర్యపేట లో ప్రారంభించిన ఆన్ లైన్ యాప్ కు డిమాండ్ పెరుగుతున్నందున మటన్, చికెన్ లను కూడా ఇక పై ఆన్ లైన్ ద్వారానే అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్నారు.అయితే ఆన్ లైన్ లో మెడిసిన్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున పట్టణంలోనీ ప్రయివేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టుల ను వినియోగించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.అదే సమయంలో సూర్యపేట లో హోల్ సేల్ షాప్ ల మూసివేతతో సూర్యపేట పరిసర ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ పట్టణ శివార్లలో ఉన్న యస్ వి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హోల్ సేల్ షాప్ ల ఏర్పాట్లపై ద్రుష్టి సారించాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలలో కీ సరుకుల సరఫరా లో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుంటా ఉంటాయన్నారు.అయితే సూర్యపేట పట్టణంలో ప్రజలు ఎవరూ యిండ్లను వీడి బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా హోల్ సేల్ షాపులలో ప్యాకింగ్ సెక్షన్ లలో పనిచేసే సిబ్బంది కూడా కంటోన్మెంట్ జోన్ లో ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలోనీ మహిళా సంఘాలను సంప్రదించి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వారిని వినియోగించే లా చూడాలని ఆయన చెప్పారు. కట్టుదిట్టం గా లాక్ డౌన్ అమలులో ఉండడం తో పాటు పరిస్థితిల ప్రభావంతో కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించి ఉన్నందున ప్రజలెవ్వరు పాలు మొదలు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అదే విదంగా మటన్, చికెన్,రంజాన్ మాసం కావడంతో దీక్ష విడిచే సమయానికి  ముస్లిం సోదరులకు పండ్లు అందుబాటులో ఉంచేలా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చర్చించినిర్ణయించినట్లు సమీక్షా అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్