Skip to main content

వలస కూలీలు, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్


వలస కూలీలు, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్


లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు, కార్మికులు, రేషన్ కార్డులు లేని వారిని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కోరారు.బుధవారం స్పెషల్ కలెక్టర్  రాహుల్ శర్మ ను కలిసి వలస కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తో ప్రభుత్వాలు లాక్ క్ డౌన్ విధించడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం తగిన వసతి కల్పించి నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు.దీపం పథకం కింద మహిళా సంఘాలకు ఉచితంగా సిలిండర్ లను కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ సమీపిస్తున్నందున రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం కావలసిన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు.లాక్ డౌన్ లో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ బ్యాంకులలో 1500 రూపాయలు జమ చేస్తానని పేర్కొనగా, ఇంకా చాలామంది ఖాతాలో డబ్బులు జమ కాలేదని పేర్కొన్నారు. రేషన్ కార్డు దారులు అందరికీ బ్యాంకులో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా ప్రజలంతా లాక్ క్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంటికే పరిమితమవుతున్నారనీ తెలిపారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను, కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.రేషన్ కార్డులు లేని పేదలకు కూడా ఉచితంగా బియ్యం, నగదును అందజేయాలని పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాడుగుల పల్లి జడ్పిటిసి సైదులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ , చెరుపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్