Skip to main content

జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 


జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి


హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.(ఇది వరకే 10 వేల నిత్యావసర కిట్లు పంపిణీ జరిగింది) మసబ్ ట్యాంక్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఈ దఫా మరో పది వేలు నిత్యవసర కిట్లు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మంత్రి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి ,గౌతం రావు ,దీపక్ రెడ్డి ,ఛాయా దేవి లతో కలిసి ప్యాకింగ్ తీరును పరిశీలించారు. ప్రతి కిట్లో  5 కిలోల మేలురకం రైస్, ఒక కిలో  పప్పు ఒక లీటర్ నూనె, పసుపు,కారం,చింతపండు- ఒక్కొక్కటి పావు కిలో చొప్పున, పికిల్ పాకెట్ -150గ్రామ్స్, ఎనర్జీ జ్యుస్ -1 లీటర్, మాస్కులు-4 ఉన్నాయి. మొత్తం 9 వస్తువులతో 10 వేల కిట్ల ప్యాకింగ్ బంజారా పంక్షన్ హాళ్ళో అయింది. సురక్షితంగా  ప్యాకింగ్  అవుతున్న తీరును  పరిశీలించిన  శ్రీమతి కావ్యా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఇంకా పొడిగించడంతో జంటనగరాల్లోని పేద ప్రజలకు ఈ కిట్లు అందించాలని కిషన్ రెడ్డి  నిర్ణయించారని, అందుకే అన్ని జాగ్రత్తలతో  ప్యాకింగ్ సిబ్బందితో కిట్లను సిద్ధం చేసామని తెలిపారు. ఈ కిట్లను రేపు మధ్యాహ్నం నగరం నలుమూలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే నిత్యావసర కిట్లతో  పాటు  2 దఫాలుగా  నాణ్యమైన  తాజా కూరగాయలు 44 టన్నులు నగరానికి తెప్పించి పేద ప్రజలకు పంపిణీ చేయించామని, అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ ఒమెన్ గ్రూప్స్ తో ప్రత్యేక కాటన్ క్లాత్ మాస్కులు కుట్టించి పేద ప్రజలకు పంపిణీ చేయించడం జరుగుతుందని కావ్య తెలిపారు. ఢిల్లీలో దేశవ్యాప్త కమాండ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్న మంత్రి కిషన్ రెడ్డిగారు ప్రతినిత్యం తన హైదరాబాద్ కార్యాలయ సిబ్బందితో,పార్టీ క్యాడర్ తో,స్వచ్చంద సంస్థలతో  చర్చిస్తూ జంట నగర ప్రజల కోసం పని చేస్తున్నారని ,ఈ కష్ట కాలంలో కరోనాను జయించడమే మన అందరి లక్ష్యమని కావ్య కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ కు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపారు. అలానే ప్రాణాలకు తెగించి కరోనాపై  పోరాడుతున్నా డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్