Skip to main content

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం


టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  



 ప్రపంచమంతా కరోనా దరిమిలా  ఎక్కడి  కక్కడ  కొత్త పద్దతులతో  జీవించాల్సిన  పరిస్థితులు  వచ్చాయని , తప్ప ని పరిస్థితులలో  నూతన  పద్దతుల ను  అవలంభించడం  జరుగుతుందని మంత్రి  జగదీశ్  రెడ్డి   చెప్పారు . ఇందులో  భాగంగానే  టెలి కాన్ఫరెన్స్ ద్వారా   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  నిర్వహించు కోవడం  జరిగిందని  , ఇందుకు  సహకరించిన  మునిసిపల్  కౌన్సిల్  సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపారు . శుక్రవారం  103 కోట్ల 14 లక్షల 65 వేల తో  2020 -21 ఆర్థిక  సంవత్సరానికి  గాను  బడ్జెట్ అంచనా , 2019 -20  సంవత్సర  సవరింపు  బడ్జెట్  అంచనా  ఆమోదానికి  గాను శుక్రవారం  కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్  బడ్జెట్   సమావేశం   నిర్వహించారు .  నల్గొండ  మున్సిపల్  కార్యాలయం లోని  సమావేశ  మందిరం  నుండి  నిర్వహించిన  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా  హాజరైన  రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి  గుంత కండ్ల  జగదీశ్  రెడ్డి   మాట్లాడుతూ  కరోనా  నేపథ్యం లో  కొత్త  పద్దతుల  ద్వారా  ఎక్కడికక్కడ  కార్యక్రమాలు  నిర్వహించడం  జరుగుతుందని , ఇందులో  భాగంగానే   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్  సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా  నిర్వహించుకోవడం  జరిగిందని  చెప్పారు . వ్యాక్సిన్  కనుగొనే దాకా  కరోనా  మనం  జీవించాల్సిందే నని, కరోనా  మనకు మీటర్  దూరం  లోనే  ఉండనే  విషయాన్ని  ప్రతి  ఒక్కరు  గమనించి  జాగురత తో   వ్యవహరించాలని  సూచించారు .  కరోనా  మీద  చేసే  యుద్దానికి  మనం  ప్రభుత్వానికి  బాసట గా  నిలవాలన్నారు . త్వరలోనే  జోన్ల  విషయం లో  కేంద్ర   ప్రభుత్వం  నిర్ణయం  తీసుకొని  జోన్ల పద్ధతి  ఉంచాలా  , ఎత్తివేయాలా అనే  అంశం పై  నిర్ణయం  తీసుకుంటుందని  చెప్పారు .ఏ ప్రాంతం లో నైతే  కరోనా  వైరస్  వ్యాపిస్తుందో  అక్కడ  ప్రజలే  స్వచ్చందంగా  నిర్బంధం పాటించుకునే విదంగా  సిద్ధం  కావాలన్నారు . నల్గొండ లో  ప్రారంభం లోనే  కరోనా  ను  గుర్తించి , కరోనా  కట్టడికి  పకడ్బందీ  చర్యలు చేపట్టి  పూర్తి  స్థాయి లో  కరోనా ను  కంట్రోల్  చేయడం  జరిగిందన్నారు .   కరోనా  కట్టడి లో మునిసిపల్  కార్మికుల , సిబ్బంది  సేవలు  అభినందనీయమన్నారు .  మున్సిపల్  కౌన్సిల్  సభ్యులు  సైతం  ఎక్కడికక్కడ  సహకరిస్తూ  కరోనా  కట్టడికి  కృషి  చేశారని  ఇందుకు  వారికీ   కృతజ్ఞతలు  తెలిపారు .  రెడ్  జోన్ల  లో  సైతం పని  చేసిన  ఘనత  మున్సిపల్  సిబ్బంది కి  ఉందని , సహకరించిన  నల్గొండ  పట్టణ ప్రజలకు   కృతజ్ఞతలు  తెలిపారు .  కరోనా  కట్టడి  విషయం లో  పార్టీ ల  కతీతంగా  కృషి  చేశారో  నల్గొండ పట్టణ అభివృద్హి కి సైతం  పార్టీల  కతీతంగా  ముందుకు  రావాలని  పిలుపు  నిచ్చారు . జిల్లా  కలెక్టర్  ప్రశాంత్  జీవన్ పాటిల్  మాట్లాడుతూ  మునిసిపల్  నూతన   చట్టం  గురించి  ప్రతి  ఒక్కరు  అవగాహన కలిగి  ఉండాలని , నూతన  చట్టం  10  శాతం గ్రీన్ ప్లాన్  ఉండాలని  సూచించారు . బడ్జెట్ లో  ఒకటి  బై  మూడవ వంతు  నిధులు   విలీన  గ్రామాల  అభివృద్ధికి  కేటాయించడం  జరిగిందని , అలాగే వెనుక బడిన ప్రాంతాలకు , దళిత  వాడల అభివృద్ధికి  అధిక  నిధులు  బడ్జెట్ లో కేటాయించడం  జరిగిందని  చెప్పారు .  మునిసిపాలిటీ లో ఖర్చు ఎక్కువగా  ఉంది  ..ఆదాయం  తక్కువగా  ఉందని  ఆదాయ వనరులు  పెంచుకునేలా  ప్రణాళిక  సిద్ధం  చేయాలని అధికారులను  ఆదేశించారు .  నల్గొండ  ఎమ్మెల్యే  కంచర్ల  భూపాల్  రెడ్డి  మాట్లాడుతూ సి .యం.  కె .సి ఆర్ , మంత్రులు  కె .టి .ఆర్ . , జగదీష్ రెడ్డి  ల  సహకారం  తో  నల్గొండ పట్టణాన్ని  అన్ని  విధాలుగా  అభివృద్ధి  చేసేందుకు  కృషి చేయడం  జరుగుతుందని  ఇందుకు  సంబందించిన  పనులు  సైతం  ప్రారంభ మయ్యాయని  చెప్పారు .   మునిసిపల్  కౌన్సిలర్ల తో పాటు నల్గొండ పట్టణ  ప్రజలు   అభివృద్ధికి  సహకరించాలని    కోరారు . అంతకు  ముందు  ఇటీవల  మృతి  చెందిన కౌన్సిలర్  దుబ్బ కాంతమ్మ ఆత్మకు  శాంతి  కలగాలని ఆకాంకిస్తూ రెండు  నిముషాల   మౌనం పాటించి  శ్రద్ధాంజలి   ఘటించారు . నల్గొండ  మునిసిపల్  కార్యాలయం  లోని  కౌన్సిల్  హాల్  నుండి మునిసిపల్  చైర్మెన్  మందడి సైది  రెడ్డి  అధ్యక్షత     కౌన్సిలర్లకు  టెలి కాన్ఫరెన్స్  ద్వారా  జరిగిన   ఈ సమావేశం లో  జిల్లా  పరిషత్  చైర్మెన్  బండా నరేందర్ రెడ్డి , అదనపు   కలెక్టర్  రాహుల్  శర్మ ,  మునిసిపల్  కమిషనర్  భూక్యా  దేవ్  సింగ్ , వైస్  చైర్మెన్  అబ్బగొని  రమేష్  గౌడ్ , మునిసిపల్  అధికారులు  కిరణ్  కుమార్ ,  శంకర్ , ముర్తుజా , నర్సింహా  రెడ్డి ,  పద్మ ,  తదితరులు పాల్గొన్నారు .


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్