Skip to main content

అమృత్ పథకం పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మిర్యాలగూడ,నల్గొండ పట్టణం లో అమృత్ పథకం,దేవరకొండ పట్టణం లో మిషన్ భగీరథ పనుల పై సమీక్ష



నల్గొండ,మే 27. నల్గొండ,మిర్యాలగూడ పట్టణాల లో చేపట్టిన అమృత్ పథకం కింద చేపట్టిన పనులు,దేవరకొండ అర్బన్ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ పనుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో అమృత్ పనులు,దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ అర్బన్ పనుల పై నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్ భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ లు హజరయ్యారు.
దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథ  ఆన్యూటీ మోడ్ లో పట్టణం లో చేపట్టిన పనులు అసంపూర్తి గా వున్నట్లు తెలిపారు.పట్టణం లో ఒకట వ వార్డ్ లో త్రాగు నీరు సరిగా రావటం లేదని,పనులు అసంపూర్తి గా వున్నట్లు,మార్కెట్ యార్డ్ పరిధి లో ఇండ్లకు త్రాగు నీరు రావటం లేదని, స్లూయిజ్ వాల్వ్ ఏర్పాటు చేయాలని అన్నారు.పైపు లైన్ వేసిన రోడ్డు కట్టింగ్  రిపేర్ చేయాలని అన్నారు.చాలా ప్రాంతాల్లో నల్లాలు బిగించాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రోడ్డు కటింగ్ పునరుద్దరణ కు అదనపు నిధులు మంజూరు కు అంచనాలు వేసి ఈ. ఎన్.సి.కి పంపించాలని  ఈ ఈ ని ఆదేశించారు.మిషన్ భగీరథ కింద అసంపూర్తి పనులు పూర్తి చేయాలని అర్. డబ్ల్యు.ఎస్.అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మిర్యాలగూడ పట్టణంలో అమృత్ కింద చేపట్టిన పనుల్లో 11 లింకేజి లు కొత్త గా వేసిన పైపు లైన్ నుండి,పాత పైపు లైన్ లు కలిపేందుకు,25 కి. మీ.అదనపు పైపు లైన్ మంజూరు కు ఈ.ఎన్.సి కి అనుమతి కు లేఖ రాయాలని శాసన సభ్యులు భాస్కర్ రావు కోరారు.పట్టణం లో 8000 నల్లా కనెక్షన్ లు వున్నట్లు,అదనంగా 8000 నల్లా కనెక్షన్ లు మంజూరుకు ఈ.ఎన్.సి కి రాయాలని, పట్టణం లో మిషన్ భగీరథ ట్యాంకు లకు నిర్దేశించిన విధంగా 10 ఎం.ఎల్.డి కి తక్కువగా 6 ఎం.ఎల్.డి మాత్రమే సరఫరా అవుతున్నట్లు,త్రాగు నీరు పచ్ఛ గా వస్తున్నట్లు తెలిపారు. రోడ్ కట్టిం గ్ అయిన చోట అదనపు నిధులు మంజూరు కు చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ పబ్లిక్ హెల్త్,అర్. డబ్ల్యూ.ఎస్.అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ లో కూడా పైపు. లైన్ వేసినప్పుడు రోడ్డు కటింగ్ అయిన చోట పునరుద్దరణకు అదనపు నిధుల మంజూరు కు ప్రభుత్వం కు ప్రతి పాదనలు పంపించాలని కోరారు.320 కి. మీ.పైపు లైన్ వేయడం పూర్తి చేసినట్లు,నల్గొండ మున్సిపాలిటీ లో కలిసిన శివారు గ్రామాలకు పూర్తి స్థాయిలో త్రాగు నీరు అందించాలంటే 50 కి. మీ.అదనపు పైపు లైన్ వేయాలని అన్నారు.63 లింకేజిలు జూన్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.ఇంటర్ కనెక్షన్ లు పూర్తి చేయాలని ఆదేశించారు.జోనల్ పద్దతి లో త్రాగు నీరు అందించాలని సమావేశం లో ఆయన కోరారు.సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఈ ఈ కందుకూరి వెంకటేశ్వర్లు,అర్.డబ్లూ.ఎస్. ఈ ఈ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ లు,ఏజెన్సీ లు,మున్సిపల్ డీ. ఈ.లు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్