Skip to main content

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:


జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,


ఎస్.పి. ఏ.వి.రంగనాథ్*



నల్లగొండ,మే6. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ   అనేక సదలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసినందున నిర్మాణ రంగంలో పనులకు ఇబ్బంది లేకుండా సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా కు వినియోగ దారులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్ లు తెలిపారు.ప్రభుత్వ పనులకు,నిర్మాణ పనులకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని, ఈ దశలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి ఇక్కడ పని చేసేలా వారికి నచ్చ చెప్పి వివరించాలని,పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎస్పీ  ఏ.వి.రంగనాథ్ లు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వలస కార్మికులు,సాండ్ టాక్సీ,స్మశాన వాటికలు,ఇంకుడు గుంతల నిర్మాణం,మున్సిపాలిటీ లో దుకాణాలు తెరవడం,తదితర విషయాలపై కలెక్టర్,ఎస్.పి.లు నిర్దేశం చేశారు.ప్రభుత్వ పనులకు ఆటంకం లేకుండా ఇసుక సరఫరా కు ప్రాధాన్యత నివ్వాలని వారు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలస కార్మికులు  నిర్మాణ రంగం,ఇటుక బట్టీ లు,దుకాణాలు,పరిశ్రమలు పనిచేసే వారిని ప్రభుత్వం అనుమతించిన మేరకు స్వస్థలాలకు వెళ్లి క్వారం టైన్,వైద్య పరీక్షలు ఇతర నిబంధనలు పాటించ వలసి వుంటుందని, అనుమతించిన  ప్రదేశాల్లో పని చేసేలా వారికి వివరించాలని చెప్పారు.గ్రామ పంచాయతీ ల్లో స్మశాన వాటికల నిర్మాణం,సోక్ పిట్స్ నిర్మాణ పనులు కొనసాగించాలని అన్నారు. మున్సిపాలిటీ ల్లో నిత్యావసర,మందుల దుకాణాలు యదావిధిగా పనిచేస్తాయని,మిగతా దుకాణాలు మున్సిపల్ కమిషనర్ లు  దుకాణాలకు నంబరింగ్ వేసి ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 50 శాతం మేర తెరచేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.సాయంత్రం 7 గంటల నుండి కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు.పాన్,గుట్కా,టొబాకో ఉత్పత్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వి.సి.లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,రోహిత్ సింగ్, లిం గ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్