Skip to main content

మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్

 


మిషన్ భగీరథ కింద చేపట్టిన ఇంట్రా పనులు వేగవంతం చేసి త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ కింద బల్క్ వాటర్ సరఫరా, ఇంట్రా పనులు నియోజక వర్గం వారిగా పెండింగ్ పనుల పై మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్  భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత త్రాగు నీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మెయిన్ గ్రిడ్ నుండి బల్క్ వాటర్ సరఫరా కు పెండింగ్ లో నున్న ఇన్ లెట్ కనెక్షన్ లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రా  విలేజ్ పనులు కింద 1534 ఓ.హెచ్ ఎస్.ఆర్ లకు గాను 1494 పూర్తి చేసినట్లు,40 పెండింగ్ లో నున్నట్లు మిషన్ భగీరథ అధికారులు వివరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ ఓ.హెచ్.ఎస్.ఆర్.లు పూర్తి చేసి కనెక్షన్ లు ఇవ్వాలని అన్నారు.ఇప్పటి వరకు 4275.82 కి.మీ. లకు గాను 4119కి.మీ. పైపు లైన్ వేయడం జరిగిందని, పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 355339 ఇంటింటి నల్లా కనెక్షన్ లకు గాను 330719 నల్లా కనెక్షన్ లు పూర్తి చేసినట్లు,పెండింగ్ 24 620 నల్లా కనెక్షన్ లు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇసుక సరవురా  కొరత  ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని,వెంటనే సరఫరాకు చర్యలు తీసుకుంటానని అన్నారు.అన్ని ఆవాస ప్రాంతాలకు బల్క్ వాటర్, ఓ.హెచ్.ఎస్.ఆర్ లు కమిషనింగ్, నల్లా కనెక్షన్ లు పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్.ఈ లు లలిత,కృష్ణయ్య లు,ఈ ఈ మోహన్ రెడ్డి లు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్