Skip to main content

గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దు - జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్


నల్గొండ,మే 20..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.ఉపాధి హామీ కింద పని కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి. ఓ.లు,ఏ.పి. ఓ.లు,, పంచాయతీ కార్యదర్శులు,ఈ జీ ఎస్ సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,నర్సరీలు నిర్వహణ,మొక్కల సంరక్షణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీ ల్లో ఒక లక్షా 53 వేల 290 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని,ప్రతి జి.పి.లో సరాసరి 197 మంది హజరు అవుతున్నారని,సరాసరి ప్రతి జి.పి.లో 250 మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒక్కొక్కరికి సరాసరి 137 రూ. ల వేతనం వస్తుందని,వచ్చే వారం నాటికి సరాసరి వేతనం165  రూ.లు చెల్లించేలా పనులు కల్పించాలని సూచించారు.
నర్సరీల లో మొక్కలు జి.పి.గ్రీన్ ప్లాన్ ప్రకారం పెంచాలని,పంచాయతీ కార్యదర్శులు మొక్కలు సంరక్షణ బాధ్యత వహించాలని అన్నారు.ముఖ్యంగా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టాలని,జామ,ఉసిరి,బొప్పాయి,మునగ,నిమ్మ లాంటి మొక్కలు ప్రతి నర్సరీలో పెంచాలని అన్నారు.ప్రైమరీ బెడ్స్ ద్వారా కొన్ని మొక్కలు పెంచాలని,పూల మొక్కలు కూడా తప్పనసరిగా పెంచాలని అన్నారు.జీవామృతం ప్రతి నర్సరీ లో తయారు చేసి సాయంత్రం వేళలో నీరు పెట్టే ముందు ప్రతి మొక్కకు అందించాలని అన్నారు.జీవామృతం వాడే ముందు తగు జాగ్రత్తలు తీసుకోక పోతే మొక్కలు చనిపోయే ప్రమాదం వుందని అన్నారు. వారంలో సంబంధిత అధికారులు ప్రతి నర్సరీ ని సందర్శించి ఎం.పి. ఓ.లు  మొక్కల స్థితిగతుల పై  నివేదికలు పంపించాలని ఆదేశించారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెండ్,రిజెక్ట్ పేమెంట్ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాయని,కొన్ని మండలాల్లో ఎక్కువగా ఉన్నాయని,పేమెంట్ లకు సంబంధించిన వివరాలను కార్యదర్శులకు ఇచ్చి క్లియర్ చేయాలని అన్నారు.ప్రతి గ్రామంలో ఎస్.బి.యం.కింద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మించాలని అన్నారు. టైప్ 1 కింద ఈ నెలాఖరు లోగా వినియోగించు కొవాలని సూచించారు.
 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి  అధికారి శేఖర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.కె.వీర బ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్