మద్యం దుకాణాలు ఖాళీ


దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. ఇక తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ఒక్కో షాపులో పది నుంచి పదిహేను లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలైన్లలోనే ఉన్నారు. కాగా.. కొన్ని చోట్ల మద్యం సిబ్బంది మద్యం దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. రేపు డిపో నుంచి మద్యం స్టాక్ వచ్చాకే అమ్మకాలు జరుపుతామని దుకాణదారులు తెలిపారు. నేడు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.


Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ