Skip to main content

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్



తిప్పర్తి, మా డ్గుల పల్లి,దామరచర్ల మం డలాల్లో నర్సరీలు సందర్శించిన జిల్లా కలెక్టర్



.గ్రామ పంచాయతీ ల్లో నర్సరీ ల్లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి  మండలం రాయిని గూడెం,మా డ్గులపల్లి మండలం కొత్త గూడెం,దామరచర్ల మండలం రాజ గట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సందర్శించారు.
నర్సరీ ల్లో మొక్కల పెంపకం, జెర్మినేషన్,గ్రామ గ్రీన్ ప్లాన్,వైకుంఠ దామం,కంపోస్ట్ షెడ్ ల పనుల ప్రగతి పై మండల ,గ్రామ అధికారులతో చర్చించి ఆదేశాలు,సూచనలు జారీ చేశారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించాలని,హరిత హరం కార్యక్రమం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జి.పి
కి ఒక నర్సరీ ఏర్పాటు చేసిందని అన్నారు.ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు హరిత హరం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని,గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు పెంచుతూ మొక్కలు చని పోకుండా మొక్కలకు వాటరింగ్,చేయాలని అన్నారు.పల్లె ప్రగతి లొ గ్రామంలో తిరిగి గ్రామ ప్రజల నుండి వివరాలు సేకరించి గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు సిద్దం చేస్తున్నారా, ఏ ఏ మొక్కలు  రకాలు,సంఖ్య అధికారులతో సమీక్షించారు.అడిగి తెలుసుకున్నారు.గ్రామం లో గ్రీన్ ప్లాన్ ప్రకారం నర్సరీ ల్లో మొక్కలు పెంచి హోం స్టెడ్,అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్,పొలాల్లో బండ్ ప్లాంటేషన్ కు వానాకాలం మొక్కలు నాటేందుకు సిద్దం చేయాలని అన్నారు.
మొక్కలు బాగా పెరిగేలా జీవామృతం మొక్కలకు పట్టించా లని,మొక్కలు పోషకాలు లభించి బాగా పెరుగుతాయని అన్నారు.జి.పి.నిధుల నుండి డ్రమ్ములు ఏర్పాటు చేసుకో వాలని, జీవామృతం తయారీ చేసి అందులో నుండి మొక్కలకు ఎరువుగా వేయాలని అన్నారు.నర్సరీల వద్ద వివరాలు తెలిసేలా ఐరన్ తో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కొత్త గూడెం గ్రామంలో గుల్ మోహర్ లాంటి పొడవు గల చెట్లు రహదారుల వెంబడి రెండు కి.మీ .అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలని సూచించారు మండల పంచాయతీ అధికారి తమ పరిధిలో అన్ని నర్సరీలు సందర్శించి మొక్కలు వివరాలు,స్థితి గతులు జి.పి.వారీగా నివేదిక అందచేయాలని అన్నారు.వాస్తవ పరిస్థితిని నివేదించాలని,తప్పుడు వివరాలు సమర్పించ వద్దని తెలిపారు.మొక్కలు ఎక్కడైనా తక్కువ గా వుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్రామ కార్యదర్శి,ఎం.పి.డి. ఓ.లు మొక్కల బాధ్యత వహించాలని అన్నారు. సేవకుల చెల్లింపులు పై తెలుసుకున్నారు.
గ్రామంలో వైకుంఠ ధామం లు,కంపోస్ట్ షెడ్ ల నిర్మాణం ల పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. నిర్మాణం లు వెంటనే పూర్తి చేయాలని, సిమెంట్,హార్డ్ వేర్ షాప్ లు తెరచి నట్టు,ఇసుక సరఫరా కు ఇబ్బంది లేదని,కూలీలు,మేస్త్రీలు ఏర్పాటు చేసుకొని పనులు పూర్తి చేయాలని అన్నారు.కొత్త గూడెం గ్రామంలో వైకుంఠ ధామం భూమి రిజిస్ట్రేషన్ పూర్తి నాలుగు రోజుల్లో చేసి నిర్మాణాలు మొదలు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్,ఎం.పి.డి. ఓ.లు.,తహశీల్దార్ లు,ఎం.పి. ఓ.లు, సర్పంచ్ లు,గ్రామ అధికారులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్