Skip to main content

కేసీఆర్ కు అల్టిమేటం ఇచ్చిన బండి సంజయ్




 జనగాం ఘటనపై  24 గంటల్లో కేసీఆర్ స్పందించాలని 
అల్టిమేటం ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ 

జనగామలో మంగళవారం   మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా, నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారని,  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, లాఠీచార్జ్ లను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  జనగాంలో పోలీసుల లాఠీచార్జ్ లో  గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను ఆయన  పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు.
బీజేపీ కార్యకర్తలు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరిపితే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు.
అసలు వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అభ్యంతరం ఏంటిని, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలిని,  జనగాం మున్సిపల్ కమిషనర్, దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలిని డిమాండ్  చేశారు. బిజెపి కార్యకర్తలపై పోలీసులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని,  బిజెపికి ఏయే ప్రాంతాల్లో పట్టు ఉందో ఆయా ప్రాంతాల్లో, పోలీసులు బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని. సీఎం డైరెక్షన్ లో కొంతమంది ఐపీఎస్ అధికారుల సూచనలతో మా కార్యకర్తలను రక్తం వచ్చేలా కొడుతున్నారని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్థంతి సందర్భంలోనూ, స్వామి వివేకానంద గారి జయంతి సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రాలేదని విమర్శించారు. భారత్ మాతా కీ జై, స్వామి వివేకానందకు జై అని నినదించిన వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏమి చెప్పదల్చుకున్నాడని  ప్రశ్నించారు.
దసరా పండగ వేళ నల్గొండలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన 20 మంది బిజెపి కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని, ఇప్పుడు జనగాంలో బిజెపి కార్యకర్తలపై నిర్ధాక్షిణ్యంగా దాడులకు తెగబడ్డారని, ఇంకా ఎంతమంది బిజెపి కార్యకర్తల రక్తం కళ్ళారా చూడాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. భయపడటానికి మేమేం టీఆర్ఎస్ మంత్రులం, కార్యకర్తలం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడుతామని,   కేసీఆర్ అరాచక, గడీల, నియంతృత్వ పాలనను బద్దలుకొడతామని హెచ్చరించారు.
కేసీఆర్ కు 24 గంటలు టైం ఇస్తున్నమని,  జనగాం ఘటనపై స్పందించాలని అల్టిమేటం  ఇచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్  ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు  తీసుకోవాలని   లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. దెబ్బకు దెబ్బ తీస్తాం అని అన్నారు. 

జనగాం ఘటనపై కేసీఆర్ 24 గంటల్లో స్పందించాలని
అల్టిమేటం ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్

జనగామలో మంగళవారం   మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బిజెపి కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా, నిర్ధాక్షిణ్యంగా దాడి చేశారని,  రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు, లాఠీచార్జ్ లను ప్రోత్సహిస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  జనగాంలో పోలీసుల లాఠీచార్జ్ లో  గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి కార్యకర్తలను ఆయన  పరామర్శించారు. బిజెపి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫామ్‌హౌస్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని, రాష్ట్రంలో స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకునే పరిస్థితి లేదని అన్నారు.
బీజేపీ కార్యకర్తలు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరిపితే మున్సిపల్ కమిషనర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు.
అసలు వివేకానందుడి ఫ్లెక్సీ పెడితే అభ్యంతరం ఏంటిని, లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలిని,  జనగాం మున్సిపల్ కమిషనర్, దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలిని డిమాండ్  చేశారు. బిజెపి కార్యకర్తలపై పోలీసులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతోందని,  బిజెపికి ఏయే ప్రాంతాల్లో పట్టు ఉందో ఆయా ప్రాంతాల్లో, పోలీసులు బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని. సీఎం డైరెక్షన్ లో కొంతమంది ఐపీఎస్ అధికారుల సూచనలతో మా కార్యకర్తలను రక్తం వచ్చేలా కొడుతున్నారని అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్థంతి సందర్భంలోనూ, స్వామి వివేకానంద గారి జయంతి సమయంలోనూ కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రాలేదని విమర్శించారు. భారత్ మాతా కీ జై, స్వామి వివేకానందకు జై అని నినదించిన వారిపై దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అని అన్నారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏమి చెప్పదల్చుకున్నాడని  ప్రశ్నించారు.
దసరా పండగ వేళ నల్గొండలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డెక్కిన 20 మంది బిజెపి కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని, ఇప్పుడు జనగాంలో బిజెపి కార్యకర్తలపై నిర్ధాక్షిణ్యంగా దాడులకు తెగబడ్డారని, ఇంకా ఎంతమంది బిజెపి కార్యకర్తల రక్తం కళ్ళారా చూడాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. భయపడటానికి మేమేం టీఆర్ఎస్ మంత్రులం, కార్యకర్తలం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడుతామని,   కేసీఆర్ అరాచక, గడీల, నియంతృత్వ పాలనను బద్దలుకొడతామని హెచ్చరించారు.
కేసీఆర్ కు 24 గంటలు టైం ఇస్తున్నమని,  జనగాం ఘటనపై స్పందించాలని అల్టిమేటం  ఇచ్చారు. ఇప్పటికైనా కేసీఆర్  ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు  తీసుకోవాలని   లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. దెబ్బకు దెబ్బ తీస్తాం అని అన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్