తండా బచావో అంటూ పొడు భూముల పట్టాల కోసం నెల్లికల్ లిఫ్ట్ నిర్మాణం కోసం గిరిజన చైతన్య యాత్ర చేపడుతున్న నాగార్జున సాగర్ నియోజక వర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేధిత. దశాబ్దాల గిిరిజనుల సమస్యల పరిష్కారం కొరకు ఈ యాత్ర చెపడుతున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు నాగార్జున పేట నుండి ఈ యాత్ర ప్రారంభమై రాత్రి 10 గంటలకు తండా నిద్ర తో నాయకన్ తండా లో ముగుస్తుంది.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment