Skip to main content

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ‌జ్వేల్‌లో మొక్క‌లు నాటిన ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా  గ‌జ్వేల్‌లో మొక్క‌లు నాటిన   ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల 




గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ‌జ్వేల్‌లోని హ‌రిత హోట‌ల్ ప్రాంగ‌ణంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త మొక్క‌లు నాటారు. మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్‌.సి రాజ‌మౌలి గుప్త‌, కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ‌నివాస్ గుప్త‌తో పాటు వారంతా మొక్క‌లు నాటారు. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టినుంచే ప‌చ్చ‌దాన్ని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శ్రీ‌నివాస్ గుప్త అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని హరిత హోటల్స్ లో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. పుస్తకాల్లో చదివిన అశోక చక్రవర్తిలా సీఎం కేసీఆర్ గారు చరిత్రకెక్కారన్నారు. దశాబ్దాల వరకు ఆక్సిజన్ కి ఇబ్బందులు లేకుండా కోట్లాది మొక్కలు సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో నాటడం జరిగిందన్నారు. ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన స్పూర్తితో మొక్కలు నాటుతున్నారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ జ‌క్కీయోద్దీన్, కౌన్సిల‌ర్లు మెట్ట‌య్య‌, చందు, హరిత హోటల్ డి.ఈ నటరాజ్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, వైశ్య నాయ‌కులు సంతోష్ గుప్త, కనకయ్య, సంపత్, శేఖర్, ప్రవీణ్, భిక్షపతి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్