Skip to main content

అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP


 

*అధిక ఫీజులు వసూలు చేస్తున్న  మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP*

నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డి.వి.కె రోడ్ లో గల మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు   సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్ పాఠశాలల ముందు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నిరసన కార్యక్రమం చేస్తున్న ABVP  విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని *ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* గారు అన్నారు.  ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ పేరుతో ప్రారంభమైన ఈ మిషనరీ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ నేడు వేలకోట్ల ఆస్తులు గడిచిందని ఆరోపించారు. 

ఈ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాల ఉన్నప్పటికీ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల నుండి కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాల మాదిరిగానే ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని, 

అన్నమో రామచంద్రా అంటూ కరోనా కాలంలో అతి కష్టం మీద జీవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం నిత్యం బెదిరిస్తూ ఫీజులు కట్టకపోతే మీ మీ పిల్లల అడ్మిషన్ రద్దవుతుంది అని బెదిరిస్తున్నారని,

మొబైల్ ఉపయోగించడమే రాని LKG,UKG,  మొదటి తరగతి మరియు రెండవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కూడా ముక్కు పిండి మరి  25 వేల నుండి 40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, గత సంవత్సరం  లాగే ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచకుండా తీసుకోవాలని జీ.వో నెంబర్ 46 లో ఉన్నా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెయింట్ ఆల్ఫొన్సస్ హై స్కూల్ మరియు మొంట్ ఫోర్ట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని  అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ సంబంధిత అధికారులు డి.ఈ. ఓ గారు కలెక్టర్ గారు స్పందించి సదరు పాఠశాలలపై క్రిమినల్ కేసులు పెట్టి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలపై చర్యలు  తీసుకొని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, నగర సంఘటన కార్యదర్శి రుద్ర విగ్నేష్, మల్లేపల్లి నవీన్ కుమార్,ఎర్రోళ్ల స్వామి, బానోత్ నాగేందర్,చిట్టిమల్ల శివ కుమార్,శివ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్