Skip to main content

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నాం - చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

 



ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నాం -  చిన్న మరియు మధ్యతరహా పత్రికల రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు.


హైదరాబాద్ : ఎంపానెల్ అయిన ప్రాంతీయ పత్రికలకు తెలంగాణ సమాచార శాఖ రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి అటెండెన్స్ నిర్వ‌హిస్తూన్న  ఒరిగింది మాత్రం ఏమీ లేదని, యజ‌మానుల జీవితాలు క‌రిగిపోవ‌డం త‌ప్ప‌ ప్ర‌భుత్వం చేసింది మాత్రం శూన్య‌మ‌ని చిన్న మరియు మధ్యతరహా  పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు  విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం చిన్న , మధ్యతరహా, మ్యాగజైన్ లకు  ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకుండా నిరంకుశ ధోరణి  ప్రదర్శిస్తున్నదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా, ధర్నాలు చేసిన ఫలితం దక్కలేదని  చివరగా  మాకు జరుగుతున్న   అన్యాయానికి  నిరసనగా  దాదాపు 10 వేల మంది ఎడిటర్లు, విలేఖరులు  ఉన్నారని వారంతా పట్టభద్రులేనని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నామని తెలిపారు.   గెలిచి మళ్ళీ అధికార  పార్టీలోకి పోయేవారికి కాకుండా  ఎన్నిక‌ల్లో గెలిచే సత్తా ఉన్న  ప్రతిపక్ష పార్టీకి  మద్దతు పలుకుతామని తెలిపారు. అంతే గాకుండా  మాకు జరుగుతున్న అన్యానికి  నీరసనగా నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో 200 మందికి పైగా ప్రాంతీయ పత్రిక‌ల ఎడిట‌ర్లు, విలేకరులు పోటీ చేయ‌నున్నామని తెలిపారు.   ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా వివ‌క్ష ధోర‌ణిని విడ‌నాడాలని,  అవినీతి అధికారుల‌ను తొల‌గించాలని,  మా న్యాయ‌మైన డిమాండ్ల‌ను నెర‌వేర్చాలని,  ప్ర‌క‌ట‌న‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవ‌ల ఎంపానెల్‌మెంట్ అయిన పత్రిక‌ల ఎడిట‌ర్ల‌కు అక్రిడిటేష‌న్ కార్డులు ఇవ్వాలని,  ప్ర‌భుత్వం స్పందించ‌ని ప‌క్షంలో పెద్ద ఎత్తున ఉద్య‌మాల‌ను చేస్తామని,  రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బంగారు తెలంగాణాలో జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ &మ్యాగజైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, డిప్యూటీ  ప్రధాన కార్యదర్శి వై.అశోక్,ఉపాధ్యక్షులు, దాయనంద్, ఆగస్టీన్, కోశాధికారి అజామ్ ఖాన్, భూపతి రాజు,వెంకటయ్య, మహమ్మద్ ఖాసీం, జాన్ షాహీద్ ,ఆఫ్రోజ్ ఖ్యరేషి, మోసీన్    అలీ, తదితరులు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్