ప్రభుత్వ రంగ పరిరక్షణకై పూలే - అంబేడ్కర్ సందేశ్ యాత్ర నీలి దండు కవాతును ఈ నెల 12న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈ యాత్ర జిల్లా కోర్టు ప్రక్కనగల అంబేద్కర్ భవనం నుండీ ప్రారంబమయి,ప్రకాశం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం , అంబేద్కర్ విగ్రహం డిఈవో ఆఫీస్ వరకు వుంటుందిని తెలిపారు కవాతు లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరీ ధరించేసులని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉపాధ్యాయ యం యల్ సి.అలుగుబెల్లి నర్సిరెడ్డి, స్వేరోస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షులు. పొడపంగు రాధా గార్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment