Skip to main content

బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌

 





బిసీ క‌మిష‌న్‌లో మైనార్టీలకు చోటేది? : సీఎం కేసీఆర్‌పై మండిప‌డ్డ ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.

ముస్లిం మైనార్టీలు బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీల‌కే  ప‌నికోస్తారా ?

గ‌త ఏడేళ్లుగా మోస‌పోతున్న ముస్లిం మైనార్టీల‌కు మ‌రోసారి దొక ఇచ్చిన సీఎం కేసీఆర్‌


హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 24: 

బిసీ క‌మిష‌న్‌లో ముస్లిం మైనార్టీల‌కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి డా. దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్‌.  తెరాస స‌ర్కార్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి మైనార్టీల‌కు స‌ముచిత స్థానం వ‌స్తుంద‌ని ఆశించిన మైనార్టీల‌కు మ‌రోసారి అన్యాయం చేశార‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్‌ని న‌మ్ముకున్న వారికి దోకా మీద దోకా ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని ప్ర‌తి ఒక్క ముస్లిం సోద‌రి, సోద‌రీమ‌ణులు ఆలోచించాల్సిన విష‌య‌మ‌న్నారు. 


" 240 జీవో జారీ చేస్తూ... బిసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా తెరాస నాయ‌కులు వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్, స‌భ్యులుగా ఉపేంద్ర‌, శుభ‌ప్ర‌ద్ ప‌టేల్‌, కిషోర్‌గౌడ్‌ల‌ను నియ‌మించారు. ఇప్ప‌టికైన పున‌రుద్ద‌రించినందుకు స్వాగ‌తిస్తున్నాం. అయితే బిసి క‌మిష‌న్‌లో మైనార్టీ వ‌ర్గాల సంబంధించిన వ్య‌క్తుల‌కు చోటు లేక‌పోవ‌డం బాధాకారం. గ‌త ఏడేళ్లుగా వంచిస్తున్న కేసీఆర్‌, బిసీ క‌మిష‌న్‌లో మ‌రోసారి వారిని మోసం చేశారు. ముస్లింలు అంటే కేవలం బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ కోస‌మేనా, అని సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్ సీఎం కేసీఆర్‌ని ప్ర‌శ్నించారు."  


" కాంగ్రెస్ ప్ర‌భుత్వం మైనార్టీల‌ల‌ను బిసీ-ఈ జాబితాలో చేర్చి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది. ముస్లిం మైనార్టీల‌ను అన్ని ర‌కాలుగా ఆదుకుంది. వారి అభివృద్ధికి తోడ్ప‌డింది. కానీ తెరాస ప్ర‌భుత్వం గ‌త ఏడేళ్లుగా అన్ని విధాలుగా నిర్ల‌క్ష్యం చేసింది. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ముస్లింల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చెప్పి న‌మ్మించి మోసం చేశారు. వ‌క్ఫ్‌బోర్డ్‌కి జూడిషియ‌ల్ స్టేట‌స్ ఇస్తామ‌ని చెప్పి మాట త‌ప్పారు. వ‌క్స్‌బోర్డ్ భూముల‌ను కాపాడుతామ‌ని చెప్పిన సీఎం వాటి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేష‌న్‌కి నిధులు మంజూరు చేయ‌డం లేదు. రుణాల మంజూరు విష‌యంలో మైనార్టీల‌ను పూర్తిగా విస్మ‌రించారు. ఎన్నిక‌ల ముందు మైనార్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు, నిధులు, ఉద్యోగాలు, రుణాలు ఇస్తామ‌ని న‌మ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వాటినికి అట‌కెక్కించార‌ని అన్నారు. చివ‌రికి కేసీఆర్ మైనార్టీల‌ను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారు,  అని డా. దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు."

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్