Skip to main content

వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి - పాలడుగు డిమాండ్


 



*వీఆర్ఏ లకు పేస్కేలు జీఓ విడుదల చేయాలి*

  *-- పాలడుగు నాగార్జున* సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిమాండ్

 *నల్లగొండ తహసీల్దార్ ముందు దీక్ష*


      నల్గొండ: ఎండా అనేక వాననకా రేయింబవళ్లు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే వీఆర్ఏలకు ప్రభుత్వం పే స్కేలు  జీఓ ను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. 

          ఈరోజు నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ ఏ లా మూడవ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది..  ఈ సందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం  అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్ ఇవ్వాలని  అన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కరోనా కష్టకాలంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయినా వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగం 5 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి అమలు జరిగే విధంగా ప్రయత్నించాలని కోరారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం జరిగేవరకు సీపీఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని అన్నారు. ఓడా ఎక్కినాక ఓడమల్లయ్య దిగినాకా బోడి మల్లయ్య సామెత గుర్తుకు వస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ దీక్ష లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండా అనురాధ సిపిఎం నల్లగొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు కొండా వెంకన్న, బొల్లు రవీందర్ కుమార్ వీఆర్ఏల మండల అధ్యక్షులు  దేశ గానీ నర్సింహా, బాలస్వామి, మారయ్య ,నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

             

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్