తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...
Comments
Post a Comment