Skip to main content

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం


 డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్  విగ్రహ నిర్మాణపు పనులను పరిశీలించిన రాష్ట్ర యస్ సి సంక్షేమ  శాఖామంత్రి  కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యుల బృందం 


హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని రాష్ట్ర యస్ సి సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 125 వ జయంతి నాటికి ఇంతటి ఎత్తైన విగ్రహ నిర్మాణపు పనులు పూర్తి చేసిన మీదట ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే గౌరవానికి ప్రతీకగా ఉంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్ టి ఆర్ గార్డెన్ వద్ద నిర్మించ తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహ నిర్మాణపు పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ్యుల బృందంతో కలసి పరిశీలించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ రాజ్యాంగాన్ని లిఖించి దేశ ఔన్నత్యాన్ని నిలపెట్టిన బాబాసాహెబ్ అంబెడ్కర్ గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నందుకు దళిత వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విదంగా దేశ రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబెడ్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ మేరకు అంబెడ్కర్ పేరు కొత్త పార్లమెంట్ భవనానికి పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ఆయన స్వాగతించారు. అయితే అదే సమయంలో బిజెపి కి చెందిన సభ్యుడు రఘునందన్ రావు తీర్మానం సమయంలో బయటకు వెళ్లడంలో అంతరార్థం ఏమిటన్నది ఆపార్టీ రాష్ట్ర నేత బండి సంజయ్ తేల్చి చెప్పాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు. ఆ మాటకు వస్తే పార్లమెంట్ కు అంబెడ్కర్ పేరు పెట్టె అంశంలో బిజెపి వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.అంతే గాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం చేసిన తీర్మానం తరహాలోనే పార్లమెంట్ కు బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టాలంటూ బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీర్మానం చెయ్యలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. తద్వారా దళితుల పట్ల బిజెపి కున్న వైఖరి వెళ్లడవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్