Skip to main content

ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్,** ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల


 


ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సింది జర్నలిస్టులే - ఎంపీ లక్ష్మణ్,
ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదు - ఎమ్మెల్యే ఈటెల

సికింద్రాబాద్ : ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( IFWJ),74 వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు
వెస్ట్ మారెడ్ పల్లిలోని పద్మశాలి భవన్లో జరిగిన  సమావేశాలకు  ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు.  డాక్టర్ కే లక్ష్మణ్,  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను కలరాస్తే ప్రజల పాలిట అండగా నిలవల్సిందే జర్నలిస్టులేనని,  ప్రజలు యూపీ మోడల్ పరిపాలనను కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో వ్యవస్థలు పరస్పరం విఫలమైనప్పుడు వాటి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల బాధ్యత చారిత్రాత్మకంగా నిలుస్తుందిని పేర్కోన్నారు.
:ఈటలరాజేందర్ మాట్లాడుతూదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట పత్రిక స్వేచ్ఛ లేదని, 
నియంతృత్వ ధోరణి నడుస్తుందని, షోయబ్ ఉల్లా ఖాన్ నిజాం కి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హత్యచేశారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ మీడియా నియంత్రణ చేస్తుందని, మెజారిటీ పత్రికల్లో ప్రజాసమస్యల ప్రస్తావన లేదు.. పార్టీల సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. పత్రికల వారు మాకు అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, జర్నలిస్టులు అందరూ షోయభుల్లా ఖాన్ వారసులుగా ప్రజలకోసం పని చేయలని కోరారు. చాలా మంది జర్నలిస్టులు తినడానికి తిండి లేకుండా ఉన్నారని,  కుటుంబాలు పోషించలేక పోతున్నారని, అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇస్తా అన్నారు ఇవ్వలేదని. వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.జర్నలిస్ట్ లకు అన్ని ఆసుపత్రుల్లో పని చేసే విధంగా హెల్త్ కార్డ్ లు ఇవ్వాలని
జర్నలిస్ట్ పిల్లలకు విద్య అందించాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్  చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు,  తెలంగాణ జన  సమితి అధ్యక్షుడు కోదండరాం, ఐ ఎఫ్ డబుల్యూ జె జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య, రాష్ట్ర టీజేయు అధ్యక్షుడు కప్పర ప్రసాద్,  జాతీయ  పాలకవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి, రాష్ట్ర నాయకులు భారత్, బర్ల శ్రీనివాస్, వేముల సుదర్శన్, అన్ని రాష్ట్రాల నుండి భారీగా జర్నలిస్టులు, అన్ని తెలంగాణ జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గాలు పాల్గొన్నాయి.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్