రైతు సమస్యలపై బీజేపీ ధర్నా - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల


రైతు సమస్యలపై బీజేపీ ధర్నా - బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల

నల్గొండ: రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈనెల 27న మంగళ వారం రోజుఉదయం 10 గంటలకు  బీజేపీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం  కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన  నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి ఓ ప్రకటన లో తెలిపారు. సీఎం కెసిఆర్ ఎన్నికల ముందు  ఇచ్చిన హామీల మేరకు లక్ష రూపాయల రుణ మాఫీ,రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ,తప్పు తడకల దరణిని రద్దు చేయాలని,వ్యవసాయ పనిముట్లను రాయితీ పై పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్  పిలుపు మేరకు ధర్నా  నిర్వహంచనున్నట్లు  ఆయన తెలిపారు.  నల్లగొండ జిల్లా లోని అన్ని మండల శాఖలు    మండలాలలో  ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్