Skip to main content

లోకల్ పత్రికల ఎడిటర్లు కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం


  లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం

హైదరాబాద్: లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇప్పించుట మరియు తదితర సమస్యల

పరిష్కారం గురించి అన్ని లోకల్ పత్రికల తరపున తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు వినతి పత్రం సమర్పించారు. గత 20 ఏండ్లు గా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం, తమరు ఒక అడుగు ముందుకు వేసి వివిధ యూనియన్ల, మీడియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని. తమరి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆ వినతి పత్రం లో కోరారు.

చిన్న/లోకల్ పత్రికలను ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజలకు

ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ముందుకు నడుస్తున్న చిన్న లోకల్ పత్రికల ఎడిటర్ల అందరి తరపున విన్నవించారు. చిన్న లోకల్ పత్రికల ఎడిటర్లు గా ఉన్న వారందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించాలను, చిన్న పత్రికల ఎడిటర్లను ప్రత్యేక కేటగిరీ గా గుర్తించి PF/ESI నుంచి మినహాయింపు ఇవ్వాలని. ఎడిటర్లు అందరికీ హైదరాబాద్ లోనే ఇండ్లస్థలాలు ఇప్పించాలని, చిన్న పత్రికలతో పాటు వార, మాసపత్రికలలో అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మనవి చేశారు. చిన్న పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ESI /PF నుంచి మినహాయింపు ఇచ్చి, ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనేక మంది అనేక పెద్ద పత్రికలలో, ఛానెళ్లలో పనిచేసి తమ సీనియారిటీ అనుభవంతో అనేక ఇబ్బందులు పడుతు తమ ప్రత్యేకతను చాటుతూ చిన్న పత్రికలను విజయవంతంగా నడుపుతున్నారని,. వారికి ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్ రూపంలో మరింత సహయ సహకారాలు ఇప్పించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఎండి యూసఫ్ బాబు, భీమగాని మహేష్ గౌడ్, మాతంగి దాస్ ఎ.శ్రీనివాస్ ,తాటికొండ కృష్ణ,వై.ఎల్.ఎచ్. అశోక్, డి.బాలకృష్ణ, అప్రోజ్ ఖురేషి, హుస్సేన్ ఎక్భాల్, ఎం.డి. మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్