Skip to main content

అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు


 అందరికీ సమాన న్యాయం జరగాలంటే యూనియన్ సివిల్ కోడ్ ఉండాల్సిందే: ఎమ్మెల్యే రఘునందన్ రావు


గజ్వేల్ లో 13 రోజుల క్రితం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అరెస్ట్ అయినా వారి కుటుంబాలను కలిసి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల గాలి తెలంగాణకి, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా సాకింది , సోకింది అని చెప్పడానికి గజ్వేల్ లో జరిగిన సంఘటన నిదర్శనం అని బిజెపి నాయకుడు దుబ్బాక ఎమ్మేల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గత పదమూడు రోజుల కింద రెండు వర్గాల ప్రజల మధ్య జరిగిన సంఘర్షణలో గాయపడ్డ , జైలుకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులకు రఘునందన్ రావు పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం లో చాలా సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూనియన్ సివిల్ కోడ్ అవసరమని చాలామంది అభిప్రాయ పడుతున్నారనీ అన్నారు. గజ్వేల్ లో జరిగిన సంఘర్షణలో ఓ వర్గానికి ఒక న్యాయం ,మెజారిటీ వర్గ ప్రజలకు మరో న్యాయం జరిగిందని మెజారిటీ ప్రజలు జైల్లో ఉంటే మరో వర్గం ప్రజలకు బెయిల్ దొరకడం ఏంటని అన్నారు.మెజారిటీ వర్గ ప్రజలకు అనచలని చూడటం దురదృష్టకరం అని,ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని దేశం లో సమన్యాయం ఉండాలని కులం , మతం,ప్రాంతాల మీద చట్టం మారకుడదని యూనియన్ సివిల్ కోడ్ తెచ్చే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వం లో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనీ అన్నారు. మతం పేరు మీద ,కులం పేరు మీద ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశం అని దీన్ని భారత ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.యూపీయే అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని ,UPA లో ఉన్న వారందరూ దేశ ద్రోహులే అని ప్రజలు అనుకుంటున్నారని అందుకే ప్రజలు నరేంద్ర మోడీ కి ఓటు వేస్తున్నారని భావించి అందుకే ఒకటి రెండు సార్లు UPA ఫెలైందని కాబట్టి అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఇండియా అని పేరు మార్చుకున్నారనీ అన్నారు. తమకు ఎవరు నమ్ముత లేరని UPA లో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనిచించింది కాబట్టి ఇండియా అని పేరు పెట్టుకున్నారు అని అన్నారు.వచ్చే ఎన్నికల్లో జరిగేటు వంటి యుద్ధం భారతీయులకి ,ఇండియా అని పేరు పెట్టుకున్న UPA కూటమికి మధ్య జరిగే యుద్ధం అని అన్నారు. ఈ దేశం లో మెజారిటీ ప్రజలు 74 శాతం హిందువులు ఉన్నారని చెప్పుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో 20 శాతం రాక ముందే ఇట్లుంటే యూనియన్ సివిల్ కోడ్ అవసరం ఉందా లేదా దీన్ని ప్రజలు గమనించాలి అని రఘునందన్ రావు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ , బిజెపి రాష్ట్ర నాయకుడు కప్పర ప్రసాద్ రావు, ధరం గురువా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నలగమ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రాములు పట్టణ అధ్యక్షులు మధుసూధన్ గజ్వేల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగింది.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్